తిరుమల : బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీ(TTD) లోని పలు ట్రస్టులకు 43 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ మేరకు విరాళం(Donations) డీడీలను టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డికి దాత శనివారం అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 33. 33 లక్షలు, ఎస్వీబీసీ ట్రస్టుకు రూ. 10.11 లక్షలు అందించారు.
భక్తిభావాన్ని పంచిన విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం
భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం టీటీడీ చేపట్టిన విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం భక్తిభావాన్ని పంచింది. పలువురు భక్తులు నేరుగా పాల్గొనగా, వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ సందర్భంగా తిరుమల వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు కోగంటి రామానుజాచార్యులు, మారుతి, అనంతగోపాలకృష్ణ అఖండ పారాయణం చేశారు. విష్ణు సహస్రనామ స్తోత్రం 108 శ్లోకాలను మూడు సార్లు పారాయణం చేశారు.