భువనగిరి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పుణ్యక్షేత్రంలో భక్తులు రద్దీ నెలకొన్నది. వారాంతపు సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో క్యూలైన్లలో భక్తులు బారులుతీరారు. యాదాద్రీశుడి ధర్మ దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం తీసుకుంటున్నది. యాదాద్రిపై ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.