Brahmotsvams | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనులపండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి రాత్రి చంద్రప్రభ వాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు. నవనీత కృష్ణుడి అలంకారంలో విశేష తిరువాభరణాలు ధరించి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తులు కర్పూర హారతులు పట్టారు. వాహనసేవ ముందు కళా బృందాల ప్రదర్శనలు భక్తులను అలరించాయి.
ఉదయం స్వామివారు సూర్యమండల మధ్యస్తుడై హిరణ్మయ స్వరూపుడిగా రామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులను కటాక్షించారు. శంఖు చక్రాలు, కత్తి, విల్లు, బాణం, వరద హస్తంతో భక్తులకు సూర్యప్రభ వాహనంపై నుంచి అనుగ్రహించారు. మరో వైపు సోమవారం బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకోనున్నాయి. ఉదయం రథోత్సవం, రాత్రి 7గంటలకు అశ్వవాహన సేవతో స్వామివారి వాహన సేవలు ముగియనున్నాయి. కార్యక్రమంలో పెద్ద జీయర్స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.