తిరుపతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ పలు ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఈవో ఎ వి ధర్మారెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆగస్ట్ 15న టీటీడీ పరిపాలన భవనం నుంచి మహతి ఆడిటోరియం వరకు ఉద్యోగులు, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. ర్యాలీలో ఉద్యోగులందరూ పాల్గొనాల న్నారు . జాతీయ ఉత్సవాలను నిర్వహించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రతి ఉద్యోగికి పంపిణీ చేయాలని జేఈవో సదా భార్గవిని ఆదేశించారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉద్యోగులందరూ తమ ఇళ్ళ పై త్రివర్ణ పతాకం ఎగుర వేయాలన్నారు . జిల్లా పోలీసులతో సమన్వయం చేసుకుని , భారీ ర్యాలీ వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలగ కుండా చూడాలని సీవీఎస్వో నరసింహ కిశోర్కు సూచించారు. ప్రతి ఉద్యోగి త్రివర్ణ పతాకం బ్యాడ్జి ధరించి తెల్లటి యూనిఫారంతో ర్యాలీలో పాల్గొనేలా చూడాలని అన్ని విభాగాధిపతులను ఆయన ఆదేశించారు. టీటీడీ విద్యాసంస్థల నుంచి 1000 మంది విద్యార్థులను ర్యాలీకి ఎంపిక చేశామని జెఈవో ఈఓకు తెలిపారు.