అమరావతి : తిరుమలలో ఈనెల 10 నుంచి 12 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సందర్భంగా మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 65,577 మంది భక్తులు దర్శించుకోగా 29,165 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4. 06 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు . కాగా తిరుమలలోని 12 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచి ఉన్నారు. దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.