న్యూఢిల్లీ: కరోనా వైరస్పై పోరాటంలో క్రికెటర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఆర్థిక సహాయం ప్రకటించగా, తాజాగా ముంబై ఇండియన్స్ క్రికెటర్లు కృనాల్, హార్దిక్ పాండ్యా 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు సరిగ్గా లేక సతమతమవుతున్న వారి కోసం ఈ సహాయం చేస్తున్నట్లు పాండ్యా సోదరులు పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ రహానే 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాడు.