నల్లగొండ: జిల్లాలోని మర్రిగూడెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. బైక్ అడిగినందుకు తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని లెంకలపల్లికి చెందిన వెంకటయ్య, శ్రీశైలం తండ్రీ కొడుకులు. శ్రీశైలం (21) తొమ్మిదో తరగతి వరకు చదివి ఆపేశాడు. తండ్రికి చేదోడుగా పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ తాళంచెవి కావాలని తండ్రిని అడగడంతో అతడు మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీశైలం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. అప్పటికే మరణించాడని వైదులు వెల్లడించారు.