భువనేశ్వర్ : బ్రేకప్ చెప్పిందనే కోపంతో ఓ యువకుడు మాజీ గర్ల్ఫ్రెండ్పై దాడి చేసిన ఘటన భువనేశ్వర్లో జరిగింది. ఆదివారం ఈ ఘటన జరగ్గా బాధితురాలు చంద్రశేఖర్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివరాలు బయటకు వచ్చాయి.
బాలిక తనను దూరం పెట్టిందనే ఆగ్రహంతో నిందితుడు ప్రకాష్ సింగ్ ఆమెపై దాడికి తెగబడ్డాడు. బాలిక పిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు, నిందితుడు గత మూడేండ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరూ ఇటీవల విడిపోయారు.
బాలిక ఇటీవల నిందితుడిని పిలిచి అతడి మొబైల్ ఫోన్లో ఉన్న తన ఫోటోలు, వీడియోలు అన్నింటినీ డిలీట్ చేయాలని కోరింది. నిందితుడు నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు బాలికపై భౌతిక దాడికి దిగాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.