అమరావతి : తల్లి తనకు కుక్క పిల్లను కొనివ్వలేదన్న మనస్తాపంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరంలో ఈ విషాద ఘటన జరిగింది. షణ్ముక వంశీ (16) అనే యువకుడు ఇటీవల ఆన్లైన్లో రూ. 30 వేల విలువైన ఓ కుక్క పిల్లను చూసి కొనివ్వాలని తల్లిని కోరాడు. కొన్నిరోజుల తర్వాత కొందామని తల్లి చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం తల్లి ఇంట్లో లేని సమయంలో గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుమారుడి మృతితో తల్లి రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.