అమరావతి : కడప జిల్లాలో ఫ్యాక్షన్ మరోసారి పడగ విప్పింది. ప్రత్యర్థుల చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ దారుణ హత్యకు గురయ్యాడు. లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కోమన్నూతల గ్రామానికి చెందిన మునెప్ప గత ఎన్నికల్లో వైసీపీ నుంచి సర్పంచ్గా గెలిచాడు. నాటి నుంచి మునెప్పకు ఆయన ప్రత్యర్థులకు స్థానికంగా ఆధిపత్య పోరు నడుస్తున్నది. దీంతో అదును చూసి మునెప్పను హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం ఆధారాలు సేకరించాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.