ముంబై: ప్లాస్టిక్ బ్యాగ్లో ఉన్న మహిళ మృతదేహం మురికి కాలువలో లభించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మఖుర్ద్ ప్రాంతంలో స్థానికులు దీనిని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించారు. 30 ఏండ్ల మహిళను హత్య చేసి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి ప్లాస్టిక్ బ్యాగ్లో కుక్కి డ్రైనేజీలో పడేసినట్లు అనుమానిస్తున్నారు. ఆమె మెడలో మంగళసూత్రం, చేతికి గాజులు ఉండటంతో వివాహితగా భావిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడంతోపాటు సమీప పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నారు.