షిల్లాంగ్ : బ్యాంక్ చోరీ కోసం వచ్చి రాబరీకి విఫలయత్నం చేసిన మహిళ మూడు రోజులు అక్కడే చిక్కుకుపోయి ఆపై పోలీసులకు పట్టుబడింది. షిల్లాంగ్లోని మేఘాలయా బ్యాంక్లో దోపిడీకి వచ్చిన 40 ఏండ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు శుక్రవారం పనివేళలు ముగిసే సమయానికి వచ్చిన మహిళ ఆపై దోపిడీకి పాల్పడే ఉద్దేశంతో అక్కడే ఉండిపోయింది.
శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం బ్యాంకును తెరిచిన మేనేజర్కు మహిళ కనిపించింది. మేఘాలయా రూరల్ బ్యాంక్ విష్ణుపూర్ బ్రాంచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యాంకులో కొన్ని సీసీటీవీ కెమెరాలు, సీసీటీవీ మానిటర్ను ధ్వంసం చేసిన ఆనవాళ్లు కనిపించడంతో బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ స్ట్రాంగ్రూమ్ను పగులగొట్టేందుకు ప్రయత్నించినట్టు ఆధారాలు కనిపించాయని బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు.