న్యూఢిల్లీ : ఆర్ధిక వివాదం ముదరడంతో తనతో సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా పొడిచిచంపిన ఘటన దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో సోమవారం వెలుగుచూసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి హత్య చేసేందుకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
మెహ్రౌలిలోని భగవతి ఆస్పత్రికి సమీపంలో మహిళ కత్తిపోట్లకు గురైందనే సమాచారం రావడంతో పోలీస్ పెట్రోలింగ్ వాహనం అక్కడకు చేరుకుంది. ఆపై బాధితురాలిని ఎయిమ్స్ ట్రౌమా కేర్కు పోలీసులు తరలించారు. ఈ ఘటనలో నిందితుడు హరీష్(20)ను ఘటనా స్ధలంలో అరెస్ట్ చేశారు.
బాధిత యువతిని దుర్గా విహార్, ఖాన్పూర్కు చెందిన బీనా(19)గా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.