కాచిగూడ : కిరోసిన్ స్టవ్ పై చాయ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఓ మహిళకు తీవ్ర గాయల య్యాయి. దవాఖానాలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది.
ఎస్సై బద్దం నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్లకుంట డివిజన్ గోల్నాకలోని భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్ సతీమణి ఊర్మిళ (45) అక్టోబర్ 27న తెల్లవారుజామున కిరోసిన్ స్టవ్ వెలిగించి వంటచేస్తుండగా ప్రమాద వశాత్తు స్టవ్లోంచి మంటలు ఎగిసిపడి ఊర్మిళ చీరకు అంటుకున్నాయి.
దీంతో ఊర్మిళ శరీరం దాదాపు 100 శాతం కాలింది. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు డాక్టర్లు దృవికరించినట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.