న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో రూ కోటిన్నర విలువైన జింక కొమ్ములతో పట్టుబడిన మహిళ (23)ను ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ నుంచి జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు.
నిందితురాలిని అరుణా నగర్, మజ్నూకా టిల్లాకు చెందిన చోటీ అలియాస్ ఫాతిమాగా గుర్తించారు. తిమార్పూర్ ప్రాంతంలో మహిళ జింక కొమ్ములను విక్రయిస్తోందనే సమాచారంతో అటవీ వన్యప్రాణుల శాఖ అధికారులతో కలిసి పోలీసులు దాడులు చేపట్టి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో జింక కొమ్ములను విక్రయించేందుకు తాను యూపీలొని బహ్రీక్కు చెందిన గోపాల్ ఠాకూర్ వద్ద వీటిని కొనుగోలు చేశానని విచారణలో మహిళ వెల్లడించిందని పోలీసులు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద తిమార్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని డీసీపీ సాగర్ సింగ్ వెల్లడించారు. తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు.