భోపాల్ : భర్త నపుంసకుడని తెలిసి నిలదీయడంతో కట్నం కోసం అత్తింటి వారు మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో వెలుగుచూసింది. ఇండోర్లోని నెహ్రూ నగర్లో నివసంచే మహిళకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైకి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.
పెండ్లయిన వెంటనే దంపతులు హనీమూన్ ట్రిప్కు వెళ్లగా భర్త సంసారానికి పనికిరాడని గుర్తించింది. ఈ విషయంపై అత్తింటి వారిని ప్రశ్నించగా అదనపు కట్నం కోసం మహిళను హింసించారు. వివాహ సమయంలో రూ 5 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను కట్నంగా ఇచ్చినా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ పది లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వారు వేధిస్తున్నారని ఆరోపించింది.
భర్త తనను దూరం పెడుతుండటంతో నిలదీశాననే కోపంతో అత్తింటి వారు తనను ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపారని ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు ఆధారంగా భర్త, అత్త, వదినలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.