న్యూఢిల్లీ : ఘజియాబాద్లోని ఓ హోటల్ రూంలో 48 ఏండ్ల మహిళ అనుమానాస్పదంగా మరణించిన ఘటన గురువారం ఉదయం వెలుగుచూసింది. బుధవారం రాత్రి ఆమెతో పాటు హోటల్కు వచ్చిన వ్యక్తి కనిపించకపోవడంతో అతడే ఈ ఘాతుకానికి పాల్పడి పరారయ్యాడని అనుమానిస్తున్నారు.
హోటల్ ఆర్యదీప్లోని రూంలో మహిళ విగతజీవిగా పడిఉందని హోటల్ సిబ్బంది గురువారం ఉదయం 10.30 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు.
మృతురాలిని అలీగఢ్కు చెందిన ప్రియాంక దేవిగా గుర్తించారు. బాధిత మహిళ బుధవారం రాత్రి 11.30 గంటలకు హోటల్కు వచ్చారని, ఉదయం హోటల్ సిబ్బంది రూంను క్లీన్ చేసేందుకు తలుపులు తెరవగా మహిళ మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్పీ నిపుణ్ అగర్వాల్ వెల్లడించారు.