న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఓ హైరైజ్ అపార్ట్మెంట్లో లిఫ్ట్ కుప్పకూలిన ఘటనలో వృద్ధురాలు మరణించింది. పరాస్ టిరా సొసైటీలో లిఫ్ట్ కేబుల్ తెగడంతో లిఫ్ట్ కుప్పకూలి 25వ ఫ్లోర్లో నిలిచిపోయింది.
ఆ సమయంలో లిఫ్ట్లో ఉన్న 72 ఏండ్ల వృద్ధురాలు భయంతో గుండెపోటుకు గురయ్యారు. సెక్టార్ 137లోని హైరైజ్ సొసైటీలో గురువారం మధ్యాహ్నం 4.30 గంటలకు ఈ ఘటన జరిగిందని డీసీపీ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
లిఫ్ట్ నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి మహిళ మృతికి కారణమైన మెయింటెనెన్స్ కంపెనీ, సొసైటీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More :
Gyanvapi Mosque | గట్టి భద్రత మధ్య జ్ఞానవాపిలో ప్రారంభమైన సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ సభ్యులు