తాండూరు రూరల్, ఆగస్టు : ప్రమాదవశాత్తు ఓ మహిళ నీటి గుంతలో పడి మృతి చెందిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం, సిరిగిరిపేట గ్రామంలోని అన్నపూర్ణ (42) అనే మహిళ నీటి గుంతలో పడి మృతి చెందినట్లు తెలిపారు. ఈ మహిళకు మతిస్థిమితం సరిగ్గాలేదన్నారు. మృతురాలు కర్నాటక రాష్ట్రంలోని సేడం తాలుకాకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.