భోపాల్: మహిళా కానిస్టేబుల్పై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో కూడా తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ నెల ఆరంభంలో ముగ్గురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత మహిళా కానిస్టేబుల్ ఈ నెల 13న మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫేస్బుక్లో ఫ్రెండ్గా పరిచయమైన ప్రధాన నిందితుడు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తనతో వాట్సాప్లో చాట్ చేస్తున్నట్లు చెప్పింది.
సోదరుడి పుట్టిన రోజు పార్టీకి తనని ఆహ్వానించాడని, ప్రధాన నిందితుడితోపాటు అతడి సోదరుడు, మరో వ్యక్తి కలిసి సామూహిక అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపించింది. దీనిని వీడియో తీశారని, ప్రధాన నిందితుడి తల్లి, మరో వ్యక్తి తనను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశారని, చంపుతామని కూడా బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ప్రధాన నిందితుడు, అతడి తల్లిని అరెస్ట్ చేసినట్లు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనురాధ గీర్వాల్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.