లక్నో : శృంగారం అంటేనే ఓ గొప్ప అనుభూతి. ఆ అనుభూతి కోసం భార్యాభర్తలిద్దరూ పరితపిస్తుంటారు. అయితే ఓ భర్త భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించింది. ఒకే రాత్రి రెండోసారి శృంగారానికి అనుమతించలేదని ఆమెను చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహ్మద్ అన్వర్(34)కు ఓ 30 ఏండ్ల మహిళతో తొమ్మిదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అమ్రోహాలో అన్వర్ బేకరీ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగిపోతోంది. ఇటీవలే ఒక రోజు రాత్రి భార్యాభర్తలకు గొడవ జరిగింది. రెండోసారి శృంగారం వద్దు అని భార్య చెప్పినందుకు భర్తకు కోపం వచ్చింది. క్షణికావేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్వర్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.