బొల్లారం : గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఈనెల 10న తిరుమలగిరి పరిధి టీచర్స్ కాలనీలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి అచేతనంగా పడి యున్నాడు. గమనించిన పోలీస్ సిబ్బంది అంబులెన్స్కు సమాచారం అందించి గాంధీ దవాఖానకు తరలించారు.
గుండె సంబందిత వ్యాధితో చికిత్స పొందుతూ…ఈనెల 18 న మృతి చెందాడని గాంధీ దవాఖానా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మృత దేహాం గాంధీ మార్చురిలో ఉన్నట్లు తెలియజేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని అతని వయస్సు సుమారు 38 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9490616433 సమాచారం అందించాలని తెలిపారు.