ఖిలావరంగల్ : కోణార్క్ ఎక్స్ప్రెస్లో గురువారం ఇద్దరు ప్రయాణికులు తరలిస్తున్న గంజాయిని వరంగల్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే వరంగల్ రైల్వే సీఐ నరేష్ తెలిపిన కథనం ప్రకారం.. రైల్వే ఎస్సై ఐలయ్య, పోలీసు సిబ్బందితో భువనేశ్వర్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్కు వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్లో తనిఖీలు నిర్వహించారు. ఎస్-7 బోగిలోని 1, 2 బెర్త్లలో ప్రయాణిస్తున్న ఒడిషా రాష్ట్రం గంజాం జిల్లా బడాసహీ ప్రాంతానికి చెందిన నిలంచల పట్నాయక్ (34), గంజాం జిల్లా పొడిగి శ్రీనగర్కు చెందిన ప్రకాష్ చంద్ర బెహెర (26) అనుమానాస్పదంగా కనిపించారు.
బ్యాగ్లను తనిఖీ చేయగా అందులో రూ. 2లక్షలు విలువగల 20కిలోల ఎండు గంజాయి ప్యాకెట్లు లభించాయి. గంజాయి బ్యాగ్లను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.