చెన్నారావుపేట : మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ రవి తెలిపారు. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపురం గ్రామానికి చెందిన ఓరుగంటి రజిత-ఎల్లస్వామిల కూతురు మహేశ్వరం గ్రామంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల పత్తి చేను వద్ద పత్తి తీయడానికి తన తండ్రితో కలిసి వెళ్లిందని మధ్యాహ్న సమయంలో భోజనం తీసుకురావడానికి ఇంటికి వచ్చి భోజనం తీసుకెళ్లగా అక్కడ తన కూతురు కనిపించలేదు. గురువారం సాయంత్రం వారి వ్యవసాయ బావిలో చూడగా బావిలో శవమై కనిపించిందన్నారు.
శవాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.