మర్పల్లి : ఇంట్లో నుంచి తప్పిపోయిన వృద్ధురాలు.. శవమై సిరిపురం గ్రామ శివారులో లభించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కుమ్మరి మాణేమ్మ(74) మతిస్థిమితం సరిగా లేదు. గత నెల 22న ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో చుట్టాల వద్ద, ఇతర ప్రాంతాలలో వెతికిన కనిపించ లేదు. దీంతో 27న మర్పల్లి పోలీస్ స్టేషన్లో మణెమ్మ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పోలీసులు ఎక్కడ వెతికిన కనిపించలేదు.
బుధవారం గ్రామ శివారులో దుర్వాసనతో పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. గ్రామస్తులు స్థానిక సర్పంచ్ మల్లయ్యకు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఒంటిపై ఉన్న బట్టలను గుర్తించి మాణేమ్మ అని నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.