వికారాబాద్ : పేకాడుతున్న 10 మందిని పట్టుకుని అరెస్టు చేసి గురువారం రిమాండ్కు తరలించినట్లు నవాబుపేట ఎస్ఐ వెంకటేశం తెలిపారు. మహ్మదాన్పల్లి గ్రామ సమీపంలోని ఓ మామిడి తోటలో పేకాట ఆడుతున్న ట్లు అందిన సమాచారం మేరకు బుధవారం రాత్రి దాడి చేసి పేకాట ఆడుతున్న పదిమందిని పట్టుకుని వారి నుంచి రూ. 70,270 నగదు, మూడు కార్లు, 4 బైక్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.