నవాబుపేట : ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పుల్మామాడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పుల్మామిడి గ్రామ పరిధిలోని ఓ వెంచర్లో ప్రశాంత్రెడ్డి (21) సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం కూడా ఇంట్లో వారికి పనికి వెళ్తున్నాను అని చెప్పి వెంచర్కు వెళ్లాడు. వెంచర్లో ట్రాక్టర్తో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడింది. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం శంకర్పల్లిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా అక్కడ వారు పెద్ద ఆస్పత్రికి తీసుకెల్లాని రెపర్ చేయడంతో జిల్లా దవాఖానకు తరలించారు.
అక్కడి డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందడని నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.