భోపాల్: ఒక వాహనం ఆరేళ్ల బాలికను తొక్కేసింది. ఆ చిన్నారి మరణంపై ఆగ్రహించిన జనం ఆ వాహనానికి నిప్పు పెట్టారు. డ్రైవర్ను కొట్టి మంటల్లోకి తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుదూ చనిపోయాడు. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి బర్ఝర్ క్రాసింగ్ వద్ద ఒక పికప్ వాహనం ఆరేళ్ల కంజిపై దూసుకెళ్లగా ఆ బాలిక మరణించింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆ వాహనానికి నిప్పుపెట్టారు. 43 ఏళ్ల డ్రైవర్ మగన్ సింగ్ను దారుణంగా కొట్టారు. మంటల్లో కాలుతున్న వాహనం మీదకు అతడ్ని తోసేశారు. దీంతో తీవ్ర కాలిన గాయాలైన ఆ డ్రైవర్ను మెరుగైన చికిత్స కోసం గుజరాత్లోని దాహోద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం అతడు మరణించాడు.
మరోవైపు ఈ ఘటనపై అలీరాజ్పూర్ పోలీసులు స్పందించారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.