పట్నా : టీనేజ్ ప్రేమికులను బాలిక కుటుంబసభ్యులు పొట్టనపెట్టుకున్న ఘటన బిహార్లోని జమూయ్ జిల్లాలో మంగళవారం వెలుగుచూసింది. వారి ప్రేమను నిరాకరించిన తల్లితండ్రులు ప్రేమికులను ఊపిరిఆడకుండా చేసి ఉసురుతీసిన ఉదంతం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పని ఉందని తల్లితో చెప్పి బాలిక బయటకు రాగా చక్కెర కొనేందుకని బాలుడు బయటకు వచ్చారు.
ప్రేమికులు ఇద్దరూ గుడివద్ద కనిపించారని, బాలిక నుదుటిపై కుంకుమ బొట్టు ఉందని స్దానికులు బాలిక తండ్రికి చెప్పడంతో బంధువులతో కలిసి ఆయన ప్రేమికులను వెంటాడాడు. బాలుడితో బాలికను చూసిన కుటుంబసభ్యులు వారిని పొలాల్లోకి లాక్కెళ్లి గొంతు నులిమి చంపారు. గ్రామస్తులు నిరసనకు దిగి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలిక తండ్రిని అరెస్ట్ చేశామని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రమోద్ కుమార్ మండల్ తెలిపారు.