లక్నో: ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశారు. వారి మృతదేహాలను ఎక్స్ప్రెస్ వే సమీపంలో పడేశారు. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఈ ఘటన జరిగింది. యమునా ఎక్స్ప్రెస్ వే వద్ద రెండు చోట్ల ఇద్దరు బాలుర మృతదేహాలను మంగళవారం గుర్తించిన కొందరు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. 8, 12 ఏండ్ల వయసున్న ఇద్దరు బాలుర మృతదేహాలు నౌజీల్, సురిర్ ప్రాంతంలో పడి ఉన్నాయని తెలిపారు.
ఒక బాలుడి మృతదేహం తలకిందులుగా వేలాడుతూ ఉన్నదని, ఇద్దరి ముఖం, ఇతర శరీర భాగాల్లో పలు గాయాలున్నట్లు పోలీసులు చెప్పారు. పోస్ట్మార్టమ్ కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించామని, డీఎన్ఏ పరీక్ష కోసం నమూనాలను భద్రపరిచినట్లు వెల్లడించారు.
హత్యకు గురైన బాలురను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతోపాటు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశామని మధుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ గోయెల్ తెలిపారు. పొరుగున ఉన్న ఢిల్లీ రాజధాని ప్రాంతం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ పోలీసులకు కూడా సమాచారం అందించినట్లు చెప్పారు.