Punjab | ఓ మహిళపై పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో దాడి చేశారు. దుండగుల వద్ద ఉన్న కత్తులను చూసి పోలీసులు కూడా భయపడిపోయారు. అక్కడ్నుంచి పోలీసులు భయంతో పారిపోయారు. ఈ ఘటన పంజాబ్ ఫిరోజ్పూర్లోని బజ్ చౌక్లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బజ్ చౌక్లో మంగళవారం మధ్యాహ్నం ఓ 50 ఏండ్ల మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా, నలుగురు దుండగులు ఆమెను అడ్డగించారు. ఆ తర్వాత ఆమెపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఓ ఇద్దరు పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దుండగులను అడ్డుకోలేకపోయారు. వారి వద్ద ఉన్న కత్తులను చూసి పోలీసులు కూడా పారిపోయారు. అయితే బాధిత మహిళ ఓ హత్య కేసుకు సంబంధించి కోర్టుకు వాంగ్మూలం ఇచ్చి తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఆమెను అడ్డగించి కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. మహిళపై దాడిని అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.