అమరావతి : సరదాగా కాల్వలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. కర్నూల్ జిల్లా పెద్దకడుబూరు మండలం గవిగట్టు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదోని మండల కేంద్రానికి చెందిన విజయ్ (22), లక్ష్మణ్ (35) గవిగట్టు గ్రామశివారులోని ఎల్ఎల్సీ కాల్వలో ఈత కొట్టేందుకు దిగారు. నీటి ప్రవాహ ఉధృతి అధికంగా ఉండటంతో కాల్వలో గల్లంతై మృతి చెందారు. మృతదేహాలను స్థానికులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.