అమరావతి : కడప జిల్లాలో విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చిన్నమండెం మండలం సద్దలగుట్టపల్లె గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మృతులను ఓబన్నగారి పల్లెకు చెందిన తరుణ్ (16), ఉపేంద్ర (14)గా గుర్తించారు. పీర్ల పండుగ కోసం విద్యార్థులు ఓబన్నగారి పల్లె నుంచి సద్దలగుట్ట పల్లెకు వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విద్యార్థుల మృతదేహాన్ని చెరువు నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.