వరంగల్ : జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఈ స్టేషన్ నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్ కదలగానే ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడుచుకున్నారు. దీంతో నెక్కొండ – వరంగల్ మధ్య ఉన్న ఏలుగూరు రైల్వేస్టేషన్ వద్ద చైన్ను లాగారు. అనంతరం ఆ ఇద్దరు కూడా రైలు నుంచి దిగి పారిపోయారు. వారిద్దరిని యాచకులుగా రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.