హైదరాబాద్ : భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. జూలూరుపాడు మండలం భోజ్యాతండా వద్ద ఘటన చోటు చేసుకున్నది. స్నానం కోసం కాలువలో దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని నర్సింహరావు (34), బాబురావు (42)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి ఆచూకీ
స్థానికుల సహాయంతో గాలిస్తున్నారు.