సిటీబ్యూరో, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) : నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. బేగంబజార్లో నివాసముండే వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన అబ్దుల్ జాఫర్, శేరిలింపల్లికి చెందిన కమల్ కిశోర్ బజాజ్ నిషేధిత గుట్కాను మార్కెట్లో విక్రయిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారంతో వెస్ట్జోన్ ఇన్స్పెక్టర్ రాజేష్ బృందం శుక్రవారం షాహినాయథ్గంజ్ ప్రాంతంలో ఉన్న గోడౌన్పై దాడి చేసి రూ. 3 లక్షల విలువైన వివిధ బ్రాండ్లకు చెందిన గుట్కా, ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణను సాహినాయథ్గంజ్ పోలీసులకు అప్పగించారు.