హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నేరెడ్మెట్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరి నుంచి 30 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు.
మణికొండకు చెందిన సీలం సాయికృష్ణ(29), నైజీరియా వాసి పీటర్(38)ను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముంబైలో నివాసముంటున్న ఒకోరో అనే యువకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పీటర్ నుంచి సాయికుమార్ డ్రగ్స్ కొనుగోలు చేసి, స్థానికులకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక పీటర్ మణికొండలోని ఓయో హోటల్లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఇండియాలో అక్రమంగా ఉంటున్న పీటర్.. ముంబైకి చెందిన ఒకోరో నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్కు తీసుకువస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక గ్రామ్ ఎండీఎంఏ రూ. 10 వేలకు విక్రయిస్తున్నట్లు తేలింది. సాయికుమార్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో.. దాడి చేసి పట్టుకున్నారు.