బజార్హత్నూర్ : బజార్హత్నూర్ మండలంలోని బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుతో ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతిచెందిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది.స్థానిక ఎస్సై ఉదయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.బుర్కపల్లి గ్రామానికి చెందిన బనియ గరన్సింగ్(45), బనియ ఆశాబాయి(30) ఒకే కుటుంబానికి చెందిన బావ, మరదలు. శనివారం గ్రామసమీపంలోని పంట పొలంలో సోయా కోత కోస్తు ఉండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో చెట్టుకిందకు వెళ్లారు.
అదే సమయంలో పిడుగుపాటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయారు. దీంతో విషయం గమనించిన చుట్టుపక్కల రైతులు, కూలీలు కోన ఊపిరితో ఉన న్వీరిద్దరిని కాపాడే ప్రయత్నం చేసిన లాభంలేకుండా పోయింది. గరన్సింగ్ అక్కడిక్కడే మృతి చెందగా, ఆశాబాయి రిమ్స్కు తరలించే క్రమంలో మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.