అమరావతి : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో పండగ పూట విషాద ఘటన జరిగింది. నీటి గుంతలో ఆడుకునేందుకు దిగి నీటమునిగి పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కొత్తపుల్లారెడ్డిపురం గ్రామంలో మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను పిల్లి కొండలు (10), పిన్నిబోయిన సైదులు (10)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పండగ రోజు ఇద్దరు చిన్నారులు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు.