అమరావతి : ఏపీలోని అనంతపురం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదం (Road Accident) లో ఇద్దరు అన్నదమ్ములు (Brothers) దుర్మరణం చెందారు. గుత్తి మండలం ఎంగిలిబండ వద్ద బైకును కారు ఢీ కొట్టగా ఈ ప్రమాదం జరిగింది . ప్రమాదంలో తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన అన్నదమ్ములు చంద్రశేఖర్రెడ్డి, సదానందరెడ్డిలు మృతి చెందారు. పోలీసులు(Police) ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.