హైదరాబాద్ : కుటుంబ సభ్యుల సమక్షంలో పలుమార్లు నాన్న నన్ను అవమానించినందుకే ఆయనను హత్య చేశానని పోలీసుల ఎదుట కుమారుడు అంగీకరించాడు. టపాచ్చబుత్రా పోలీసు స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం 67 ఏండ్ల వయసున్న అలీ హుస్సేన్ ఖాన్ హత్యకు గురయ్యాడు. పెద్ద కుమారుడు అజ్మద్ అలీ ఖాన్ ఐరన్ రాడ్తో తండ్రి తలపై బాదడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. అజ్మద్కు చిన్న తమ్ముడు అర్షద్ అలీ సహకరించాడు.
ఈ కేసులో అజ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. కానీ పోలీసులు లోతుగా ప్రశ్నించేసరికి చేసిన నేరాన్ని అంగీకరించాడు. తనను కుటుంబ సభ్యుల సమక్షంలో పలుమార్లు అవమానించినందుకే నాన్నను హత్య చేశానని అజ్మద్ ఒప్పుకున్నాడు. దీంతో అన్నదమ్ముళ్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.