భద్రాద్రి కొత్తగూడెం : పలు ఇళ్లల్లో చోరీలు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. భద్రాచలం పోలీసులు బుధవారం ఇద్దరు బాల నేరస్థులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి చోరీ సొత్తు స్వీకరించిన రవి అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద రూ.5.99 లక్షలు, ఆటో, 2 ఎల్ఈడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒక బాల నేరస్థుడిపై జిల్లావ్యాప్తంగా గతంలోనే 7 కేసులు నమోదయ్యాయి.