నల్లగొండ : జిల్లాలో సంచలనం సృష్టించిన చింతపల్లి మండలం విరాట్నగర్ మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద జరిగిన హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. మూడు రోజు క్రితం ఓ వ్యక్తిని హత్య చేసి తలను మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద పెట్టిన దుండగలు మొండెంను మాయం చేసిన విషయం తెలిసిందే.
కాగా, మొడెం ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ వద్ద శిరస్సు లేని మొండెం లభించింది. ఇండ్ల మధ్యలోని ఓ ప్రైవేటు బ్యాంక్ మిద్దెపైన తల లేని మొండాన్ని పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన మూడు రోజుల తర్వాత మొండెం లభించింది.
ఈ కేసును జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి ఛాలెంజ్గా తీసుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్యకు గురైన వ్యక్తి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్య పహాడ్ తండాకు చెందిన రమావత్ జయేందర్ నాయక్(30) గా పోలీసులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే గుర్తించారు. అయితే పోస్తుమార్టం తర్వాత పోలీసులు అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు.