న్యూఢిల్లీ: హెయిర్కట్ చేయించుకుంటున్న సందర్భంలో తలెత్తన ఘర్షణలో ఒక ఖైదీపై మరో ఖైదీ కత్తెరతో దాడి చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఒక క్షురకుడు జైలు వార్డులో ఇద్దరు ఖైదీలకు వంతుల వారీగా హెయిర్కట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఒక ఖైదీ క్షురకుడి వద్ద నుంచి హెయిర్కట్ కత్తెర లాక్కొని మరో ఖైదీపై దాడి చేశాడు. ప్రతిగా అతడు కూడా ఆ ఖైదీపై తిరుగబడ్డాడు. దీంతో ఇది జైలులోని రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు దారి తీసింది.
వెంటనే స్పందించిన జైలు సిబ్బంది కొట్టుకుంటున్న ఖైదీలను విడదీసి పరిస్థితిని అదుపు చేశారు. స్వల్పంగా గాయపడిన ఖైదీలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించి తిరిగి జైలుకు తీసుకొచ్చారు.