యాచారం : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకోన్న ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చింతపట్ల గేటు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన లింగంపల్లి వినయ్కుమార్, లింగంపల్లి రోహిత్, ఉంగరాల శషాంక్లు ఆక్టీవా వాహనంపై పరీక్ష రాసేందుకు వెళ్తున్నారు. చింతపట్ల గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆల్టో కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆక్టీవాను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వినయ్కుమార్, రోహిత్, శషాంక్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.