భోపాల్ : ఇండోర్లోని కనదియా ప్రాంతం నుంచి 20 ఏండ్ల యువతిని అపహరించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొని కారులో తిరిగివస్తున్న యువతిని రెండు రోజుల కిందట నిందితులు కిడ్నాప్ చేశారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితులు యువతిని భోపాల్కు తీసుకువెళ్లారని పోలీసులకు సమాచారం అందింది. ప్రదాన నిందితుడు ఫోన్ లొకేషన్ ఆధారంగా వారు ఇండోర్లోని హోటల్లో ఉన్నట్టు పోలీసుల బృందం గుర్తించింది. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆపై అతడు పరదేశిపుర ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు టీన్ పులియా ప్రాంతం వద్ద కనదియ, పరదేశిపురా పోలీసులు బృందం నిందితుడు రితేష్ను అదుపులోకి తీసుకుంది. ఆపై అతడి స్నేహితులు ప్రతీక్, మొయిన్లను అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల చెర నుంచి యువతిని కాపాడారు.