బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని దూద్ఖానా బస్తీలో నివాసం ఉంటున్న మహ్మద్ అక్బర్(43) కారు డ్రైవర్గా పనిచేస్తుంటాడు.
గత కొంతకాలంగా మద్యానికి బానిసైన అక్బర్ ఈనెల 20న అర్థరాత్రి దాటిన తర్వాత తన యాక్టివా బైక్మీద ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. మరుసటిరోజు ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని పెట్రా అపార్ట్ మెంట్ ఎదురుగా తన యాక్టివాను పార్క్ చేసిన అక్బర్ ఫుట్పాత్పై పడిపోయాడు. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడకు చేరుకున్న పోలీసులు 108 సాయంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే అక్బర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు మృతుడి సోదరుడు నాసర్ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికంగా మద్యం సేవించడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.