గుండాల : మండలంలోని వస్తాకొండూర్ గ్రామంలో శుక్రవారం తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన బిజ్జాల లక్ష్మీనర్సయ్య వైద్యం నిమిత్తం ఈ నెల 8న హైదరాబాద్ వెళ్లాడు. దీంతో ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం పగుళకొట్టి ఇంట్లో ఉన్న బీరువాలో నుంచి 9 తులా ల బంగారు ఆభరణాలతో పాటు 2వేల నగదును దొంగిలించారు. విషయాన్ని ఇరుగు పొరుగు వారు గమనించి లక్ష్మీనర్సయ్యకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్ కానీస్టేబుల్ రవికుమార్ ఘటన స్ధలాన్ని పరిశీలించి దొంగలను పట్టుకుంటామని అన్నారు.
గుండాలలో…
గుండాల మండల కేంద్రంలోని వర్రె యాదయ్య ఇంటిలో మోత్కూర్ పట్టణానికి చెందిన పల్లపు ఉపేందర్ అనే వ్యక్తి 10వేల నగదుతో పాటుగా 5 గ్రాముల బంగారు కమ్మలు దొంగిలించగా.. అతన్ని గ్రామస్తులు పట్టుకుని నగదుతో పాటు బంగారు కమ్మలను స్వాదీనం చేసుకుని ఉపేందర్ను పోలీసులకు అప్పగించారు.