పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై చెన్నకేశవులు వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్ధార్నగర్లో నివాసముంటున్న అఖిల్ (19) సోలార్ కంపెనీలో పని చేస్తుంటాడు.
ఈ నెల 20న ఉదయం 8.30కు యథావిథిగా డ్యూటీకి వెళ్లిన అతను ఇంత వరకు ఇంటికి తిరిగి రాలేదు. చుట్టు పక్కల ప్రాంతాలలో, బంధువుల ఇండ్ల వద్ద వెతికినా ఆచూకి లభించలేదు. దీంతో తండ్రి రేనయ్య ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.