హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో వేటగాళ్ల ఉచ్చుకు పులి బలైంది. ఇంద్రవెల్లి మండలం వాల్గొండ వద్ద హీరాపూర్ అటవీ ప్రాంతంలో పులిని వేటాడి చంపారు వేటగాళ్లు. పులి చర్మాన్ని కాగజ్నగర్ తరలిస్తుండగా పోలీసులు నిందితులను పట్టుకొని, వారి నుంచి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వేటగాళ్లను పులిని చంపిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లారు పోలీసులు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.